Thursday, 12 February 2026

మరణ శాసనమే!

 అనంత సాహితీ వేదిక 

పద/వాక్య కవిత్వ పోటీకి

తేది : 12/2/26

అంశం: నిశ్శబ్దం రాసిన కవిత


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా

చరవాణి : 9542000079


శీర్షిక :  మరణ శాసనమే!


ఏమైందో ఆ తల్లికి 

ఎంత గాయమైందో ఆ గుండెకి 

ఎన్ని ప్రశ్నలు అలుపులేకుండా దాడి చేసాయో?

హృదయపు ఘోష ఒంటరితనంలో 

అలసిపోయిందా? ఆగిపోయిందా?


ప్రసవ వేదనలో యుద్ధమే చేసి ప్రాణమే నిలుపుకున్నదే! 

ప్రాణం విలువ తెలియదనుకుందామా?


బిడ్డగా ఇల్లాలిగా తల్లిగా ఉద్యోగిగా చూసిన ఏ జీవితం కూడా ఆపలేక తలవంచి దారిచ్చిందా ?


పని భారమా? భవిష్యత్తుకై భయమా ?

బ్రతుకులో ఆనందమే లోపమా?

ఏ విషపు కాటు మనసును మలినం చేసిందో!

ఏ నిస్సహాయపు వేషము అస్తమయం వైపు నడిపించిందో! 

అంతు చిక్కని అయోమయమే అంతా!


ఏ సమాధానము సంతృప్తినివ్వలేదా?

ఏ బంధము చొరవ చూపి భరోసానివ్వలేదా?


ధైర్యము ఎలా కూడబెట్టుకుందో 

బిడ్డలకు ఏమి చెప్పి ఒప్పించుకుందో 

తనువూ చాలించాలనే నిర్ణయించుకుంది.


క్షణకాలంలో ఇనుప చక్రాల రైలు బండి 

కూతలేసుకుంటూ యమపాశమై 

ఎంత దూరం ఈడ్చిందో ఆ ప్రాణాలకై 


రక్తపు మడుగులలో శబ్దాల మాటున 

ఓ నిజం స్తబ్ధుగా గాలిలో నిలిచిపోయింది 

ఎవరు ఎక్కడ విననంతగా 

దిగ్బ్రాంతికి లోనూ చేసింది 



సమాజమే ఓడించిన మహిళగా

నిశ్శబ్దంలో ఓ మరణ శాసనమే రాసింది...!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

No comments:

Post a Comment